రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇండస్ట్రీలోని ప్రముఖులు మరణిస్తున్నారు.. సినిమా వార్తలు రాసే జర్నలిస్టులు కూడా మరణిస్తున్నారు. ఇదే ఇప్పుడు అందరిలోనూ విషాదం నింపుతుంది. కేవలం రెండు నెలల వ్యవధిలో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ముగ్గురు చనిపోయారు. వాళ్ల మరణాలు కూడా ఊహించనివి. అప్పటి వరకు బాగుండి.. ఉన్నట్లుండి హఠాన్మరణం పాలయ్యారు. వాళ్లే బీఏ రాజు, టీఎన్ఆర్, కత్తి మహేశ్. తాజాగా సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరణం అందరికీ షాక్ ఇస్తుంది. ముఖ్యంగా ఆయన్ని అభిమానించే వాళ్లు కత్తి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆయనెలాంటి వాడు.. ఎన్ని విమర్శలు చేశాడు అనేది మరణించిన తర్వాత మరిచిపోతున్నారు. అయ్యో పాపం కత్తి మహేశ్ చనిపోయాడా అంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 26న జరిగిన యాక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేశ్.. చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ మరణించారు. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన హృదయ కాలేయం సినిమాలో పోలీస్ పాత్రలో నటించి నవ్వించిన కత్తి.. ఆ తర్వాత దాదాపు 10 సినిమాల్లో నటించాడు. మొన్న రవితేజ క్రాక్ సినిమాలోనూ కనిపించాడు.
కత్తి మహేశ్ కంటే ముందు బీఏ రాజు మరణం కూడా ఇలాగే అందరికీ షాక్ ఇచ్చింది.1300 సినిమాలకు పైగా పని చేసిన బీఏ రాజు సీనియర్ మోస్ట్ పీఆర్ఓ. ఈయన మే 23న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇక మే 10న సీనియర్ జర్నలిస్ట్ టీఎన్ఆర్ కూడా మరణించాడు. ఈయన కరోనాతో కన్నుమూశాడు. యూ ట్యూబ్లో సంచలన ఇంటర్వ్యూలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. ప్రముఖ సినీ జర్నలిస్టుగానే కాకుండా నటుడిగానూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న సమయంలోనే కరోనా టీఎన్ఆర్ను కాటేసింది. కేవలం 60 రోజుల వ్యవధిలోనే టీఎన్ఆర్.. బీఏ రాజు.. కత్తి మహేశ్ లాంటి సినీ ప్రముఖులు కన్నుమూశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kathi Mahesh | సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
కడవరకు కాంట్రవర్సీలతోనే కాపురం చేసిన కత్తి మహేష్
ప్రమాదమే లేదన్నారు కదా.. మరి కత్తి మహేశ్ మరణానికి కారణమేంటి?
ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తే థియేటర్లు ఎందుకు.. డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం