ప్రమాదమేమీ లేదు.. వైద్యానికి స్పందిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లోనే కత్తి మహేశ్ మళ్లీ మన ముందుకొచ్చేస్తాడు.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అస్సలు నమ్మొద్దు.. గత కొన్నిరోజులుగా కత్తి మహేశ్ వర్గం నుంచి వస్తున్న వార్తలివి. ఆయన బంధువులు, సన్నిహితులు కూడా ఇవే చెప్పారు. కత్తి మహేశ్ చికిత్స, ఆస్పత్రి ఖర్చుల కోసం ఏపీ సీఎం జగన్ రూ.17లక్షల రూపాయల సాయం కూడా అందించారు. అంతా బాగానే ఉంది.. ఇక కత్తి మహేశ్ కోలుకోవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఊహించని వార్త. కత్తి మహశ్ మరణించారన్న వార్త అందర్నీ కలచివేసింది.
ప్రమాదం జరిగిన తర్వాత కత్తి మహేశ్ పరిస్థితి విషమంగా ఉందని రెండు మూడు రోజులు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ వార్తలు పూర్తిగా ఆగిపోయాయి. కత్తి మహేశ్ కండీషన్ చాలా బాగుందని.. వైద్యానికి స్పందిస్తున్నాడంటూ ఆయన స్నేహితుడు వెంకట సిద్ధా రెడ్డి చెప్పాడు. కానీ ఇప్పుడు కత్తి మహేష్ ప్రాణాలే పోయాయి. దాంతో ఈ మధ్యలో ఏం జరిగి ఉంటుందని అంతా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి రెండు రోజుల కిందటి వరకు కూడా కత్తి ఆరోగ్యం బాగానే ఉంది. ఆయన చికిత్సకు బాగానే స్పందించాడు కూడా. వైద్యులు కూడా ఇదే చెప్పారు. మామూలు మనిషి కావడానికి కాస్త సమయం పడుతుంది కానీ ప్రాణాపాయం మాత్రం లేదని ముందు నుంచి చెప్పారు వైద్యులు. పైగా ఇప్పటి వరకు చేసిన సర్జరీలు సక్సెస్ అయ్యాయి. కంటి చూపు పోతుందనే వార్తలు వచ్చినా కూడా అలా ఏం జరగలేదు. కంటి చూపునకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. చెన్నై శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో కంటి సర్జరీ బాగానే జరిగింది.
ఇలాంటి సమయంలో ఉన్నట్టుండి ఈయన ఆరోగ్యం క్షీణించింది. రెండు రోజుల్లోనే ఆయన మరణించాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో కత్తి మహేష్ చనిపోయాడని వైద్యులు చెప్తున్నారు. దానికి తోడు ఒబిసిటీ కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. చివరి వరకు ఎంత ప్రయత్నించినా కూడా ఆయన ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు చెన్నై అపోలో వైద్యులు. ఏదేమైనా క్షేమంగా తిరిగొస్తాడని చెప్పిన కత్తి మహేశ్.. అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో ఆయన్ని అభిమానించే వాళ్లు కన్నీరు పెట్టుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kathi Mahesh | సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
కడవరకు కాంట్రవర్సీలతోనే కాపురం చేసిన కత్తి మహేష్
ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తే థియేటర్లు ఎందుకు.. డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం
ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?