Yes bank: ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యెస్ బ్యాంకుకు తమిళనాడు వస్తు సేవల పన్ను (GST) విభాగం భారీ జరిమానా విధించింది. జీఎస్టీ సంబంధిత అవకతవకల నేపథ్యంలో తమిళనాడు జీఎస్టీ విభాగం యెస్ బ్యాంకుకు రూ.3 కోట్ల పన్ను నోటీస్ ఇచ్చింది. సోమవారం యెస్ బ్యాంకుకు ఈ నోటీసులు అందాయి.
యస్ బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. తమిళనాడు జీఎస్టీ డిపార్ట్మెంట్ రూ.3,01,50,149 జరిమానా విధించింది. కాగా, ఈ పన్ను నోటీస్ బ్యాంకు ఆర్థిక లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపదని, దీనిపై న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని యస్ బ్యాంక్ పేర్కొంది.
కాగా, యెస్ బ్యాంకు గతంలో కూడా జీఎస్టీ నోటీసులు అందుకుంది. గత ఏడాది డిసెంబర్లో బీహార్ జీఎస్టీ డిపార్ట్మెంట్ వరుసగా రూ.20 వేలు, రూ.1.38 లక్షల చొప్పున వేర్వేరు పన్ను నోటీసులు జారీచేసింది.