న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ తయారీ దిగ్గజం షియోమి బుధవారం భారత్ మార్కెట్లో షియోమి 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ అమోల్డ్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలు, స్నాప్డ్రాగన్ 778జీ చిప్సెట్, 4250ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. 6జీబీ, 8జీబీ వేరియంట్లలో లభించే స్మార్ట్ఫోన్ వరుసగా రూ 26,999, రూ 28,999కి అందుబాటులో ఉంది.
షియోమి 11 లైట్ ఎన్ఈ 5జీ అక్టోబర్ అర్ధరాత్రి నుంచి నాలుగు కలర్ ఆప్షన్లు డైమండ్ డాజిల్, టస్కనీ కోరల్, జాజ్ బ్లూ, వినీల్ బ్లాక్లో లభ్యమవుతుంది. ఇక ఈ స్మార్ట్ఫోన్ సేల్ ఎంఐ.కాం, అమెజాన్.ఇన్, ఎంఐ హోం, ఎంఐ స్టూడియో ప్లాట్ఫాంలతో పాటు అధీకృత రిటైలర్ల వద్ద అందుబాటులో ఉంటుంది. సామర్ధ్యం, సౌకర్యం మేళవింపుతో కస్టమర్లకు వినూత్న 5జీ అనుభూతిని ఈ స్మార్ట్ఫోన్ అందిస్తుందని షియోమి ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘు రెడ్డి పేర్కొన్నారు.