బీజింగ్ : చైనాలో కరోనా కేసుల పెరుగుదలతో సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్లోని ఝాంఝూ ఐఫోన్ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు వెళ్లిపోతున్నారు. చైనాలోని యాపిల్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు తరలివెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hundreds of Foxconn employees are believed to have fled the factory in China's central province of Henan. It comes after workers raised concerns about insufficient medical care and under-reported COVID infections put them at high risk.pic.twitter.com/8XBZa4eGc3
— Bang Xiao 萧邦 (@BangXiao_) October 30, 2022
ఫ్యాక్టరీలో సరైన వైద్య వసతులు లేకపోవడం, కేసుల సంఖ్యను తక్కువగా చేసి చూపుతుండటంతో ఫ్యాక్టరీ కార్మికులు మూకుమ్మడిగా వీధుల్లోకి వచ్చారు. భుజాలపై లగేజ్తో పాటు, చేతికందిన వస్తువులను తీసుకుని కార్మికులు బయటపడిన విజువల్స్ కనిపించాయి.
ఈ ఫ్యాక్టరీలో దాదాపు 20000 మంది కార్మికులు పనిచేస్తున్నారని యాపిల్ సరఫరాదారు ఫాక్స్కాన్ వెల్లడించింది. ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో లోపల ఆహార సరఫరాలు అడుగంటాయని వార్తాసంస్ధలు వెల్లడించాయి. ప్రభుత్వ రవాణా సౌకర్యం లేకపోవడంతో ఫ్యాక్టరీ కార్మికులు కాలినడకనే వీధుల్లో నడుస్తుండటం ఈ వీడియోలో కనిపించింది.