హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఫోక్స్వ్యాగన్ మరో లగ్జరీ కారును దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా సంస్థ ‘టేరాన్ ఆర్ లైన్’ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.46.99 లక్షలుగా నిర్ణయించింది.
ఏడుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ మాడల్ 2.0 లీటర్ల 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఈవీఓ4 ఇంజిన్తో రూపొందించింది. కేవలం 7.3 సెకండ్లలో 100 కిలోమీటర్లు ప్రయాణించనున్న ఈ కారు గంటకు 200 కిలోమీటర్లకు పైగా దూసుకుపోనున్నది. పానోరమిక్ సన్రూఫ్, రియర్ సన్ షేడ్స్, 15 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఫుల్-డిజిటల్ కాక్పిట్, 9 ఎయిర్బ్యాగ్లు, 14 అటానమస్ ఫీచర్లతో రూపొందించింది.