న్యూఢిల్లీ, జూన్ 17: ఈ నెల 20న ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశంకాబోతున్నారు. ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరుచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాల అమలు జరుపుతున్న తీరు, బ్యాంకుల ఆర్థిక స్థితిగతులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్ సమావేశం తర్వాత జరుగుతున్న తొలి భేటీ ఇదే కావడం విశేషం. గత రెండేండ్లుగా నష్టాల్లో కాలం వెల్లదీసిన ప్రభుత్వరంగ బ్యాంకులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రెండింతలు పెరిగి రూ.66,539 కోట్లు ఆర్జించింది. 2015-16 నుంచి 2019-20 వరకు వరుసగా ఐదేండ్లుగా నష్టాలు నమోదు చేసుకున్న 12 పీఎస్బీలు రూ.31,820 కోట్ల లాభాన్ని గడించడం విశేషం.