IT Returns | లోక్సభ ఎన్నికల వేళ వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) తాత్కాలిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వేతన జీవులకు నిరాశే మిగిల్చారు. కొత్త పన్ను విధానంలో పన్ను రాయితీలు రూ.7 లక్షలకు పెంచినట్లే పెంచిన విత్త మంత్రి శ్లాబ్ లు మాత్రం యధాతథంగా కొనసాగించారు. వేతన జీవులు ఐటీఆర్ దాఖలులో కొత్త ఐటీ విధానాన్ని ఎంచుకుంటే ఎటువంటి పొదుపు, పెట్టుబడి పథకాల్లో మదుపునకు రాయితీలు ఉండవు. రూ.7 లక్షల ఆదాయం దాటిన వారు శ్లాబ్ ఆధారంగా పన్ను చెల్లించాల్సిందే.ఇక ఇంటి రుణం, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, విద్యా రుణం తదితర రూపాల్లో ఆదాయం పన్ను చట్టం-1961లోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపుల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేశారు.
కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపు రూ.3 లక్షలకు పెంచారు. అదే విధానం కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక పాత పన్ను విధానంలో ఆదాయ పరిమితి రూ.2.50 లక్షలుగా ఉంది. కాకపోతే స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు మినహాయింపు పెంచారు. పాత పన్ను విధానంలో రూ.5 లక్షల్లోపు ఆదాయంపై ఎటువంటి పన్ను భారం ఉండదు. వేతన జీవులకు ఊరట కల్పించని నిర్మలా సీతారామన్.. కార్పొరేట్ సంస్థల ఆదాయంపై పన్ను ను 30 నుంచి 22 శాతానికి తగ్గించడం గమనార్హం.