హైదరాబాద్ : యూనియన్ బ్యాంక్ ఇండియా ప్రత్యేక MSME Festive Bonanza క్రెడిట్ క్యాంప్ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ కింద డిసెంబర్ నెలలో ప్రతి బుధవారం ఎంఎస్ఎంఈ లోన్ మేళా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఖాజాగూడ బ్రాంచిలో నిర్వహించిన ప్రత్యేక క్రెడిట్ క్యాంప్లో హైదరాబాద్ జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య పాల్గొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు MSME రంగం అందిస్తున్న సహకారం గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సైఫాబాద్ రీజినల్ హెడ్ శ్రీధర్ బాబు, సైఫాబాద్ డిప్యూటీ రీజినల్ హెడ్ ప్రకాశ్ బాబు, ఖాజాగూడ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రవిబాబు, బ్యాంకు సిబ్బంది , 30 శాఖలకు చెందిన మేనేజర్లు పాల్గొన్నారు.
MSME Festive Bonanza పథకం కింద, కస్టమర్లు రూ. 25 లక్షల కంటే ఎక్కువ వ్యాపార రుణాలపై 6.80 నుండి 7.40 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో ప్రాసెసింగ్ ఛార్జీలలో మినహాయింపు పొందుతారు. అలాగే వివిధ ముద్రా రుణాలు, ఇతర చిన్న పరిశ్రమల రుణాలు ఈ ఫెస్టివల్ బొనాంజా ద్వారా అందించనున్నారు.