న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,280.38 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది అల్ట్రాటెక్ సిమెంట్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.758.7 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 68.75 శాతం అధికం. 2022-23 ఏడాది రెండో త్రైమాసికంలో రూ.13,892. 69 కోట్లుగా నమోదైన కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.16,012.13 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది.
నిర్వహణ ఖర్చులు కూడా రూ.12,934 కోట్ల నుంచి రూ.14,493 కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. రెండో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా సిమెంట్కు డిమాండ్ ఊపందుకున్నదని, ప్రభుత్వాలతోపాటు మౌలిక రంగ, గ్రామీణాభివృద్ధి, పట్టణాల్లో గృహాలకు డిమాండ్ ఉండటం కూడా ఇందుకు కలిసొచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. విద్యుత్ కోసం అయ్యే ఖర్చు 10 శాతం తగ్గగా, ముడి సరుకు ఖర్చులు 4 శాతం చొప్పున పెరిగాయని తెలిపింది.