లండన్ : రుణాల ఎగవేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న నీరవ్ మోదీ (Nirav Modi), విజయ్ మాల్యాల అప్పగింత వ్యవహారంపై బ్రిటన్ స్పందించింది. న్యాయం నుంచి తప్పించుకుంటూ ఆశ్రయం పొందాలనుకునే వారికి సరైన ప్రదేశంగా మారాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని బ్రిటన్ భద్రతా వ్యవహారాల మంత్రి టామ్ తుగేన్ధాట్ పేర్కొన్నారు.
బ్యాంకులకు కోట్లాది రూపాయల ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొని విదేశాలకు పారిపోయిన బిలియనీర్లు మాల్యా, నీరవ్ మోదీలను తిరిగి దేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తున్న నేపధ్యంలో బ్రిటన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిందితుల అప్పగింత వ్యవహారంలో భారత్, బ్రిటన్ ఇరు దేశాలూ చట్టపరమైన ప్రక్రియలకు కట్టుబడి ఉండాలని నిర్ధిష్టంగా పేర్లను ప్రస్తావించకుండా తుగేన్ధాట్ వ్యాఖ్యానించారు.
న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కోకుండా తమ దేశంలో దాగిఉండాలని కోరుకునే వారికి ఆశ్రయం ఇవ్వడం బ్రిటన్ ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. బ్రిటన్ మంత్రి కోల్కతాలో జీ20 అవినీతి వ్యతిరేక మంత్రిత్వ గ్రూప్ సమావేశం నేపధ్యంలో భారత్ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో బ్రిటన్ మంత్రి టామ్ తుగేన్ధాట్ సంప్రదింపులు జరిపారు.
Read More :
Restaurants | ఈ రెస్టారెంట్లకు వెళ్తే సరికొత్త ఎక్స్పీరియన్స్ మీ సొంతం