FD Interest Rate | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు డిపాజిట్దారులకు శుభవార్తను అందించాయి. డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం వరకు పెంచుతున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లు ప్రకటించాయి. రూ.2 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్..సాదారణ డిపాజిట్లకు 7.2 శాతం వరకు చెల్లిస్తున్నది.
ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 6 శాతం నుంచి 6.50 శాతానికి పెంచిన బ్యాంక్, రెండేండ్ల నుంచి ఐదేండ్లలోపు డిపాజిట్లపై 7 శాతం నుంచి 7.50 శాతానికి సవరించింది. అలాగే ఐదేండ్ల నుంచి పదేండ్ల డిపాజిట్లపై రేటుని 6.90 శాతం నుంచి 7.50 శాతానికి పెంచింది. మరోవైపు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన డిపాజిట్లపై రేట్లను పావు శాతం సవరించింది. ఏడు రోజుల నుంచి 10 ఏండ్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట 3.5 శాతం నుంచి 7.75 శాతం లోపు చెల్లించనున్నది.