న్యూఢిల్లీ, మార్చి 9: సీఎన్జీ (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) ధరను తగ్గిస్తున్నట్టు టొర్రెంట్ గ్యాస్ ప్రకటించింది. కిలో రేటుపై రూ.2.50 దించుతున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆ సంస్థ ఔట్లెట్లలో ఈ మేరకు కొత్త రేట్లకు అమ్మకాలు జరుగుతాయి. ఇప్పటికే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) ధరల్ని తగ్గించిన విషయం తెలిసిందే.
కాగా, తాజా నిర్ణయంతో కిలో సీఎన్జీ ధర రూ.90.50కు దిగొచ్చింది. ఇంతకుముందు రూ.93గా ఉన్నది. ఈ తగ్గింపుతో పెట్రోల్ వాహనదారులతో పోల్చితే 42 శాతం, డీజిల్ వినియోగదారులతో చూస్తే 32 శాతం సీఎన్జీ వాడకందారులకు ఆదా అవుతున్నది. ఇక తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా 7 రాష్ర్టాల్లోని 34 జిల్లాల్లో టొర్రెంట్ గ్యాస్కు 428 సీఎన్జీ స్టేషన్లున్నాయి.