ముంబై, జూన్ 15: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో పాటు దేశీయంగా కీలక రంగాల షేర్ల కొనుగోళ్ల పెరుగుదలతో సూచీలు సరికొత్త రికార్డులవైపు పరుగు పెడుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 52,751.83 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,869.51 పాయింట్ల వద్ద గరిష్టాన్ని 52,671.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,866.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,901.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని,15,842.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
సెన్సెక్స్ 0.46శాతం అంటే 241.03 పాయింట్లు ఎగిసి 52,792.56 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 0.44 శాతం అంటే 69.45 పాయింట్లు లాభపడి 15,879.95 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. దీంతో ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 2.38 శాతం, ఓఎన్జీసీ 1.96 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.43 శాతం, టాటా స్టీల్ 1.25 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.23 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 1.16 శాతం, కోల్ ఇండియా 0.78 శాతం, అదానీ పోర్ట్స్ 0.47 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 0.43 శాతం, సిప్లా 0.34 శాతం నష్టపోయాయి.