ముంబై : నిన్న లాభాల జోరు కనబరిచిన దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు ఊగిసలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులతోపాటు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కాస్త వెనక్కి తగ్గారు. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 107 పాయింట్ల లాభంతో 60,502 వద్ద ,నిఫ్టీ 26పాయింట్లతో లాభపడి 18,030 వద్ద కొనసాగుతుంది.
వొడాఫోన్ గ్రూప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 28.5 శాతం కలిగి ఉండగా, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా గ్రూప్ 17.8 శాతం వాటా కలిగి ఉన్నది. భారత ప్రభుత్వం 36 శాతం వాటాతో నిర్ణయాలలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామం తర్వాత మంగళవారం స్టాక్ సూచీల్లో వొడాఫోన్ ఐడియా షేర్లు 19 శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.