ముంబై, జూన్ 3: నిన్న నష్టాల్లో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు…ఈరోజు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.. సెన్సెక్స్ 52వేల పాయింట్లు దాటింది. నిఫ్టీ 15,700 పాయింట్ల సమీపానికి చేరుకున్నది. ఈ రోజు మొత్తం 29 కంపెనీలు క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అరవింద్ ఫ్యాషన్స్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ తదితర కంపెనీలు ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 24 పైసలు క్షీణించి రూ.72.68 వద్ద ట్రేడ్ అయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు ఒక శాతం చొప్పున పెరిగాయి. రియాల్టీ ఇండెక్స్ 4 శాతం ఎగిసింది.