ముంబై: 2021 సంవత్సరంలో సరికొత్త రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్స్ నూతన సంవత్సరంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. పలు దేశాల్లో ఒమిక్రాన్ తోపాటు కరోనా కేసులు పెరుగుతున్నా, దాని ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్స్ పై కనిపించలేదు.
దేశీయ, మార్కెట్ల పైనేకాదు అంతర్జాతీయ మార్కెట్ల పై కూడా కొత్త వేరియంట్ ఎఫెక్ట్ ఏమాత్రం చూపించలేదు. ఈరోజు ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 360 పాయింట్ల లాభంతో 58,614 వద్దఉండగా..నిఫ్టీ 110 పాయింట్లతో 17,464 వద్ద లాభాల్లో ట్రేడవుతున్నది.