Trust to Control Reliance | ఆసియా కుబేరుడు.. ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూపురేఖలే మారి పోతున్నాయా.. రిలయన్స్ యాజమాన్యం.. కుటుంబ సభ్యుల ఆస్తులు.. లావాదేవీలు ఓ ట్రస్ట్ ఆధీనంలోకి వెళతాయా.. అంటే అవుననే అంటున్నారు ముకేశుడికి సుదీర్ఘకాలంగా సన్నిహితులుగా ఉన్న ఆయన ఆంతరంగికులు .. సలహాదారులు. కొత్తగా ఏర్పాటు కానున్న సంస్థలో ముకేశ్ అంబానీతోపాటు ఆయన సతీమణి నీతా అంబానీ, పిల్లలు ఆకాశ్, అనంత్, ఈషా అంబానీ భాగస్వాములు కానున్నారు. రిలయన్స్పై కొత్తగా ఏర్పాటయ్యే ట్రస్ట్ యాజమాన్యానికి నియంత్రణ (control) అధికారాలు దఖలు పడనున్నాయి. ఇప్పటికే టాటా సన్స్ సంస్థ పూర్తిగా టాటా ట్రస్ట్ల నియంత్రణలో పని చేస్తున్న సంగతి తెలిసిందే.
భారత్లో రిలయన్స్ రోజువారీ లావాదేవీల నిర్వహణ బాధ్యతలను నమ్మకం కలిగిన నిపుణులకు ముకేశ్ అంబానీ అప్పగించబోతున్నారని వినికిడి. ఆయిల్ రిఫైనరీ నుంచి పెట్రో కెమికల్స్, టెలి కమ్యూనికేషన్స్, ఈ కామర్స్, గ్రీన్ ఎనర్జీ వరకు విభిన్న రంగాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది రిలయన్స్. అదే సమయంలో రిలయన్స్ వ్యాపార లావాదేవీల నిర్వహణ బాధ్యతలను ముకేశ్ అంబానీ తన వారసులకు అప్పగించే యోచనలో ఉన్నారని.. ఏండ్ల తరబడి దీనిపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇటీవలే ఆయన ఈ ప్రక్రియ ప్రారంభించారని తెలియవచ్చింది. తదుపరి దశలో 208 బిలియన్ డాలర్ల సామ్రాజ్య నిర్వహణకు బ్లూ ప్రింట్ సిద్ధం చేశారని ఓ ఆంగ్లదిన పత్రిక కథనం.
పలు సంపన్న కుటుంబాల మాదిరిగా తన సొంత కుటుంబంలో వారసత్వ యుద్ధం తలెత్తకుండా ముకేశ్ అంబానీ నివారణ చర్యలు చేపట్టారని తెలుస్తోంది. ఇందుకు వాల్మార్ట్ యాజమాన్య నియంత్రణ గల వాల్టన్ ఫ్యామిలీ తరహాలోనే రిలయన్స్ భవితవ్యాన్ని తీర్చి దిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారు.
2002లో రిలయన్స్ వ్యవస్థాపక అధినేత ధీరూబాయి అంబానీ మరణం తర్వాత ముకేశ్ అంబానీ.. ఆయన తమ్ముడు అనిల్ అంబానీ మధ్య విభేదాలు పొడచూపిన సంగతి తెలిసిందే. అటుపై తల్లి కోకిలాబెన్ మధ్యవర్తిత్వంతో 2005లో రిలయన్స్ రెండుగా చీలింది.. ముకేశ్ అంబానీ క్రమంగా ఉన్నత స్థాయికి చేరుకోగా, అనిల్ అంబానీ అడ్వంచర్లతో రుణాల ఊబిలో చిక్కుకున్నారు.
రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా తన బాధ్యతల నుంచి తప్పుకునే విషయమై ముకేశుడు బహిరంగ పర్చకున్నా.. తన పిల్లలను ప్రోత్సహించాలని తలపోస్తున్నారు. ఈ ఏడాది జూన్లో జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో.. ఇక ముందు సంస్థ నిర్వహణ బాధ్యతల్లో కవలలు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ (30), అనంత్ అంబానీ (26) కీలక పాత్ర పోషిస్తారని తొలి సంకేతాలిచ్చారు. అంబానీ కుటుంబంలో తర్వాతీ తరం వారసులుగా ఈషా, ఆకాశ్, అనంత్.. తమ సంస్థ మరింత బలోపేతం చేస్తారని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముకేశ్ అంబానీ మార్గదర్శకత్వంలో ఆయన పిల్లలు ఇప్పటికే మంచి అనుభవం సంపాదించారు.
కవల పిల్లలు ఈషా.. ఆకాశ్ అంబానీలు.. తమ సంస్థను రిటైల్ నుంచి టెక్నాలజీ వైపు మళ్లించడంలో కీలకమైన పాత్ర పోషించారు. జియో ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్ (ప్రస్తుతం మెటా ప్లాట్ఫామ్స్)లో 5.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. రిలయన్స్ ఈ-కామర్స్లోకి అడుగు పెట్టాలన్న ముకేశ్ అంబానీ కలను సాకారం చేసింది. పేస్బుక్ అనుబంధ వాట్సాప్తో కలిసి జియోమార్ట్ పేరిట ఈ-కామర్స్ లావాదేవీలను రిలయన్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇక జియో ప్లాట్ఫామ్స్ డైరెక్టర్గా అనంత్ అంబానీ.. ఆయిల్, కెమికల్ బిజినెస్, రెన్యూవబుల్ ఎనర్జీ యూనిట్ల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఇక ముకేశ్ అంబానీ.. సంస్థపై కుటుంబ నియంత్రణను మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. 2019 మార్చి నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్లో తన కుటుంబ సభ్యుల వాటాను 47.27 నుంచి 50.6 శాతానికి పెంచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tiktok : టిక్టాక్పై బ్యాన్ ఎత్తివేత.. గత 15 నెలల్లో ఇది నాలుగో సారి
OnePlus 9RT : పేరు మార్చుకొని భారత్లో లాంచ్ అవనున్న వన్ప్లస్ 9ఆర్టీ.. ఫీచర్లు ఇవే
Moto G200 : అద్భుతమైన ఫీచర్లతో రానున్న మోటో జీ200.. ధర ఎంతో తెలుసా?
Shortcuts : వాట్సాప్ వెబ్ లో షార్ట్కట్స్ గురించి తెలుసా..? అవేంటంటే..?
Motorola : భారత్ మార్కెట్లో త్వరలో మోటో జీ71, మోటో జీ51, మోటో జీ31 ఎంట్రీ