న్యూఢిల్లీ, నవంబర్ 2: దేశీయ ఆటో రంగానికి పండుగ కళ వచ్చింది. మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో ఆయా కంపెనీల వాహనాలు గత నెల భారీగా అమ్ముడైపోయాయి. తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్లో మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాలు 3,91,472గా ఉన్నాయి. నిరుడు ఇదే నెల 3,36,679గానే ఉండగా.. 16 శాతం వృద్ధి కనిపించింది. మారుతీ సుజుకీ సేల్స్ 21 శాతం పెరిగాయి. హ్యుందాయ్, టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోట అమ్మకాలూ ఆకట్టుకున్నాయి. ద్విచక్ర వాహన అమ్మకాలూ జోరుగా సాగాయి. హీరోమోటోకార్ప్ ఏకంగా 26.5 శాతం వృద్ధిని అందుకున్నది. హోండా, బజాజ్, సుజుకి మోటర్ సైకిల్స్, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు ఆకర్ష ణీయంగా నమోదయ్యాయి. వాణిజ్య వాహనాలకూ గిరాకీ కనిపించింది.