Stock Markets | ముంబై, ఆగస్టు 3: దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అమెరికాపై గ్లోబల్ రేటింగ్ దిగ్గజం ఫిచ్ వేసిన రేటింగ్ బాంబుతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కూడా వరుసగా మూడోరోజు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 542 పాయింట్ల నష్టంతో 65,240.68 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటం ఇందుకు కారణం.
అటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 19,300 పాయింట్ల స్థాయికి పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 144.90 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 19,381.65 వద్ద నిలిచింది.
‘అమెరికా రేటింగ్ను తగ్గించడంతో ప్రపంచ మార్కెట్లు అలజడికి గురయ్యాయి. డాలర్ బలోపేతం కావడం, బాండ్ హిల్డ్ పుంజుకోవడం కూడా మార్కెట్ల పతనానికి పరోక్షంగా కారణమవుతాయి’
– వినోద్ నాయర్, జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్