ముంబై : రష్యా – ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధంతో గురువారం భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. దీనికి తోడు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరానికి గురి చేశాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న భయాల మధ్య మదుపరులు భారీగా అమ్మకాలకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఈ ఏడాది తొలిసారిగా 2,702 పాయింట్లు నష్టపోయి 54,530 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముసింది. మరో వైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సైతం నష్టాల్లోనే కొనసాగింది. నిఫ్టీ 815 పాయింట్ల క్షీణించి.. 16,227 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1850 పాయింట్ల భారీ పతనంతో ట్రేడింగ్ ప్రారంభించింది. కొంత సమయం తర్వాత మెరుగుదల కనిపించి, 1430 పాయింట్లకు తగ్గింది. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై సైనిక ప్రారంభిస్తున్నట్లు వార్తలు వెలువడగా సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2800 పాయింట్లు పడిపోయింది. ఒకే రోజు భారీగా నష్టాలు పతనం కావడంతో రూ.13లక్షల కోట్ల సందపదను మదుపరులు నష్టపోయారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం నిఫ్టీపై కనిపించింది.
414 పాయింట్ల భారీ పతనంతో 16,648 వద్ద ట్రేడింగ్ ప్రారంభం కాగా.. రోజంతా సూచీ నష్టాల్లోనే ట్రేడయ్యాయి. బ్యాకింగ్ స్టాక్స్ గురువారం భారీగా పడిపోయాయి. బ్యాంకుల పేర్లు పడిపోవడగా వరుసగా ఆరో రోజు. బుధవారం స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్లో లాభాలతో ప్రారంభమైనా.. ర్యాలీ కొనసాగకపోవడంతో నష్టాలతో ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టంతో 57,232 వద్ద ముగియగా.. నిఫ్టీ 29 పాయింట్లు పడిపోయి 17,063 వద్ద ముగిసింది. ఇవాళ నిఫ్టీ, సెన్సెక్స్లో ఏ ఒక్క షేరు సైతం లాభపడలేదు. టాటా మోటార్స్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, గ్రేసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఐఆర్సీటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.