హైదరాబాద్, అక్టోబర్ 3: ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ ఖనిజ ఉత్పత్తిలో 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సెప్టెంబర్ నెలలో 30 లక్షల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసినట్లు సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఏడాది క్రితం ఇదే నెలలో సంస్థ 27.3 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. గత నెలలో 31.1 లక్షల టన్నుల ఖనిజాన్ని విక్రయించింది. మరోవైపు, ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో సంస్థ 19.56 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయగా..20.53 మిలియన్ టన్నులను విక్రయించింది.