న్యూఢిల్లీ, డిసెంబర్ 15: రిజర్వు బ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిరీస్-3లో భాగంగా ఈ నెల 19 నుంచి 23 వరకు సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయించనున్నది. అలాగే నాలుగో విడుత వచ్చే ఏడాది మార్చి 6 నుంచి 10 వరకు జారీ చేయనున్నది. ఈ గోల్డ్ బాండ్లను కమర్షియల్ బ్యాంకులు(స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, రిజినల్ రూరల్ బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సేంజ్లు(ఎన్ఎస్ఈ, బీఎస్ఈ)ల్లో విక్రయించనున్నారు.