న్యూఢిల్లీ, జనవరి 13: రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ప్రస్తుతం ఆయన పదవీకాలం ఈ నెల 14తో ముగియనున్నది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్యాబినెట్ ది అపాయింట్మెంట్స్ కమిటీ సమావేశమై మైఖేల్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది.