న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రముఖ ఎడ్-టెక్ కంపెనీ బైజూస్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బుధవారం మరో నోటీసునిచ్చింది. ఈసారి ఫ్రాన్స్కు చెందిన టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ సర్వీసెస్ సంస్థ దాఖలు చేసిన దివాలా పిటిషన్పై ఈ తాఖీదు బైజూస్కు వెళ్లింది. రెండు వారాల్లోగా దీనిపై స్పందించాలంటూ ఈ కేసును వచ్చే నెల 11కు ఎన్సీఎల్టీ వాయిదా వేసింది. బైజూస్కు బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీవో) సేవల్ని అందించామని, రూ.4 కోట్లకుపైగా బకాయి పడిందని, ఆ సొమ్ము ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సదరు టెలీపెర్ఫార్మెన్స్ కంపెనీ ఈ దివాలా పిటిషన్ వేసింది.
ఇదిలావుంటే డిజిటల్ మార్కెటింగ్ సంస్థ సర్ఫర్ టెక్నాలజీస్.. బైజూస్పై దివాలా పిటిషన్ను ఎన్సీఎల్టీలో వేసిన సంగతి విదితమే. రూ.2.3 కోట్లు ఇవ్వాలని కోరుతూ ఎన్ఎసీఎల్టీని ఆశ్రయించింది. దీంతో మంగళవారం కూడా బైజూస్కు ఎన్సీఎల్టీ నోటీసునిచ్చింది. మరోవైపు బైజూస్కు టర్మ్ లోన్లిచ్చిన కొన్ని విదేశీ సంస్థలు సైతం ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్లు వేశాయి. ఇవన్నీ విచారణకు రావాల్సి ఉన్నాయి. మరోవైపు బీసీసీఐ కూడా రూ.158 కోట్ల కోసం ప్రత్యేకంగా దివాలా పిటిషన్ను దాఖలు చేసింది.