న్యూఢిల్లీ, జూన్ 8: నరేంద్ర మోదీ సర్కార్ మరో ప్రభుత్వరంగ సంస్థలో వాటాను విక్రయించడానికి సిద్ధమవుతున్నది. ఎన్ఎల్సీ ఇండియాలో తనకున్న వాటాల్లో 3 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ రేట్లో మంగళవారం నుంచి విక్రయించనున్నట్టు దీపం కార్యదర్శి అరుణీష్ చావ్లా తెలిపారు. దీంట్లో 2 శాతం ఈక్విటీలు, మరొక శాతం గ్రీన్ షోస్ ఆప్షన్ కింద విక్రయించనున్నది. షేరు కనీస ధరను రూ.303గా నిర్ణయించింది.
సోమవారం బీఎసీఈ నెస్సెక్స్ ముగిసిన తర్వాత నమోదైన కంపెనీ షేరు ధర కంటే 9 శాతం తక్కువకే నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేంద్రం రూ.12,166 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించింది.