న్యూఢిల్లీ, జూలై 11: 2025-26కిగాను ఇప్పటి వరకు 1.7 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశారని ఆదాయ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీఆర్ 1,2ల దాఖలుకు చివరి రోజు ఈ నెల 31. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 1.7 కోట్ల మంది దాఖలు చేశారని, శుక్రవారం ఒకేరోజు 10 లక్షల మంది రిటర్నులు చేశారని ఐటీ శాఖ తన ఎక్స్లో పేర్కొన్నది.
వీరిలో చిన్న, మధ్యస్థాయి ట్యాక్స్ప్లేయిర్లు అధికంగా ఉన్నారు. రూ.50 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారు, వ్యవసాయం ఆదాయం రూ.5 వేల వరకు ఉన్నవారు ఐటీఆర్-1ని, హెచ్యూఎఫ్ఎస్లు ఐటీఆర్-2ని దాఖలు చేయాల్సిఉంటుంది.