న్యూఢిల్లీ, జూలై 18: ఆధార్తో పాన్ లింక్ కాకపోయినా ఐటీ రిటర్న్ దాఖలు చేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ తాజాగా వెల్లడించింది. పాన్-ఆధార్ అనుసంధానానికి జూన్ 30తో గడువు ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ లింక్ కాని పాన్ ‘ఇన్ఆపరేటివ్’ అవుతుందని, అయినంత మాత్రాన ‘ఇన్యాక్టివ్’ కాదని ఐటీ శాఖ మంగళవారం ట్వీట్ చేసింది. పాన్ ఇన్ఆపరేటివ్ అయితే పెండింగ్ రిఫండ్స్, టాక్స్ రిఫండ్స్పై వడ్డీ చెల్లింపు ఉండదని, టీడీఎస్, టీసీఎస్లు అధిక రేటుపై డిడెక్ట్ చేయడం జరుగుతుందని వివరించింది.
పర్మినెంట్ అకౌంట్ నంబర్ కలిగిన ఎన్నారైలు, విదేశీ పౌరుల పాన్.. ఆధార్తో లింక్ చేయనందున ఇన్ఆపరేటివ్ అయితే పాన్ను తిరిగి ఆపరేషనలైజ్ చేయడానికి సంబంధిత జ్యురిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్కు వారి నివాస ధృవపత్రాన్ని సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. ప్రవాస భారతీయులు గడిచిన మూడు అసెస్మెంట్ సంవత్సరాల్లో రిటర్న్లు దాఖలు చేయకపోయినా, వారి నివాస హోదాను అప్డేట్ చేయకపోయినా పాన్ ఇన్ఆపరేటివ్ అవుతుంది. వారు జేఏవోకు తగిన పత్రాల్ని సమర్పించి పాన్ డాటాబేస్లో రెసిడెన్షియల్ స్టేటస్ను అప్డేట్ చేయమని కోరాలంటూ సూచించింది.