న్యూఢిల్లీ, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర సర్కారు వివక్షత కొనసాగిస్తుంది. రాష్టానికి అన్ని ంటా నిధులను అందజేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నామని మోదీ సర్కారు చెబుతున్న మాటలకు చేతలకు పొంతనలేకుండా పోతున్నది. రాష్ర్టాలకు అందచేసిన సహాయ నిధుల్లోనూ సవతిప్రేమనే చూపించింది. ఉత్తర భారతంలోని ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ర్టాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించింది బీజేపీ ప్రభుత్వం. మూలధన పెట్టుబడుల కోసం రాష్ర్టాలకు ప్రత్యేక సహాయం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను 16 రాష్ర్టాలకు రూ.56, 415 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందుకుగాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఇందులో తెలంగాణ రాష్ర్టానికి రూ.2,102 కోట్ల నిధులను కేటాయించింది. ఆరోగ్యం, విద్య, నీటిపారుదల-సరఫరా, విద్యుత్, రోడ్లు, వంతెనలు, రైల్వేలతో సహా విభిన్న రంగాలలో మూలధనం పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమో దం లభించింది. వీటితోపాటు జల్జీవన్ మిషన్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్యోజన ప్రాజెక్ట్లకు రాష్ట్ర వాటా నిధులతో ఈ ప్రాజెక్టుల వేగాన్ని పెంచేందుకు రాష్ర్టాలకు అందచేయనున్నది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణం రూపంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1.3 లక్షల కోట్ల నిధులు కేటాయించింది.