గత కాలమ్లో సూచించినట్టే జనవరి 25 తో ముగిసిన 3 రోజుల ట్రేడింగ్ వారంలో మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది. తొలుత 21,716 పాయింట్ల గరిష్ఠస్థాయికి పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ వెనువెంటనే 21,137 పాయింట్ల కనిష్ఠానికి పతనమైంది. తిరిగి కొంతవరకూ కోలుకున్నప్పటికీ, వారం మొత్తంమీద 219 పాయింట్లు క్షీణించి 21,353 పాయింట్ల వద్ద క్లోజైంది. జనవరి 31న ఫెడ్ రిజర్వ్ పాలసీ, ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ అంశాలు ట్రెండ్ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు తెలిపారు. ముఖ్యంగా ఫెడ్ చైర్మన్ సంకేతాలు కీలకమని చెప్పారు.
సాంకేతికంగా చూస్తే క్రితం వారం పతన సమయంలో వరుసగా 2, 3 రోజులు 21,000 పాయింట్లకు కాస్త ఎగువన ఉన్న 50 డీఎంఏ రేఖ నిఫ్టీ క్షీణతను అడ్డుకోవడం, బ్యాంక్ నిఫ్టీ 200 డీఎంఏ ఎగువన ముగియడం సానుకూల అంశమైని, దీంతో ఈ వారం పూర్తిగా టర్న్ ఎరౌండ్ కాకపోయినా, కొంతమేర బౌన్స్ అవుతుందని మార్కెట్ విశ్లేషకుడు కునాల్ బోత్రా అంచనా వేశా రు. 50 డీఎంఏను నిఫ్టీ ని లుపుకున్నందున ఈ వారం కొద్దిపాటి రికవ రీ ఉంటుందని జియోజిత్ ఫై నాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కె ట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ విశ్లేషించారు.
ఈ వారం నిఫ్టీకి 21,000 పాయింట్ల వద్ద లభిస్తున్న మద్దతుస్థాయి కీలకమైనదని, ఈ స్థాయిని కోల్పోతే మరింత బలహీనపడుతుందని కునాల్ బోత్రా తెలిపారు. 21,500-21,560 స్థాయివరకూ నిఫ్టీ బౌన్స్ కావచ్చని, ట్రెండ్ పూర్తిగా బుల్లిష్గా మారాలంటే 21,800 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సి ఉంటుందని ఆనంద్ జేమ్స్ వివరించారు. స్వల్పకాలిక పొజిషన్లకు 20,900 పాయింట్ల స్థాయిని స్టాప్లాస్గా నిర్దేశించుకోవచ్చని ఇన్వెస్టర్లకు సూచించారు.