న్యూఢిల్లీ, మార్చి 11: గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన టెలిఫోన్ సబ్స్ర్కైబర్లు స్వల్పంగా పెరిగారు. డిసెంబర్ నెల చివరినాటికి స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. టెలికం దిగ్గజం జియోకు ఈసారి భారీ ఊరట లభించింది. గతేడాది నవంబర్ నెల చివరినాటికి 118.77 కోట్లుగా ఉన్నారు. వీరిలో పట్టణప్రాంతాల్లో ఉన్న టెలిఫోన్ సబ్స్ర్కైబర్లు 65.98 కోట్లు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 52.72 కోట్లు ఉన్నారు.
అలాగే వైర్లెస్ సబ్స్ర్కైబర్లు 114.86 కోట్ల నుంచి 115.06 కోట్లకు పెరిగారు. గతేడాది చివరి నెలలో జియో నెట్వర్క్లోకి 39.06 లక్షల మంది చేరగా, ఎయిర్టెల్లోకి 10.33 లక్షల మంది జతయ్యారు. కానీ వొడాఫోన్ ఐడియా 17.15 లక్షల మంది వైర్లెస్ సబ్స్ర్కైబర్లను కోల్పోయింది. అలాగే బీఎస్ఎన్ఎల్ 3.16 లక్షల మంది, ఎంటీఎన్ఎల్ 8.9 లక్షల మందిని కోల్పోయాయి.