హైదరాబాద్, సెప్టెంబర్ 29: డిజిటల్ చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ ఫోన్పే సర్వేలో ఈ విషయం తేటతెల్లమయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో 44 శాతం మంది ఫోన్పే యూజర్లుగా నమోదయ్యారు. తమ యాప్ను ఓపెన్ చేసేవారు జాతీయ సగటు కంటే తెలంగాణలో 60 శాతం అధికమని ఫోన్పే తెలిపింది. దేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్స్, గణాంకాలకు సంబంధించి ఫోన్పే పల్స్ పేరుతో ఇంటరాక్టివ్ వెబ్సైట్ను ఇటీవల ఫోన్పే ప్రారంభించింది. ఈ వెబ్సైట్లో వెల్లడైన ట్రెండ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..