న్యూఢిల్లీ : టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై హాట్ డిబేట్ సాగుతుండగా దేశీ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్ర (Tech Mahindra) కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన భవిష్యత్కు ఉద్యోగులను సిద్ధం చేసే క్రమంలో దాదాపు 8000 మంది ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇచ్చింది. గత ఏడాది నవంబర్లో ఓపెన్ఏఐ చాట్జీపీటీని లాంఛ్ చేసినప్పటి నుంచి ఏఐ పట్ల ఆసక్తి పెరగడంతో పాటు పలు కంపెనీలు తమ దైనందిన కార్యకలాపాల్లో న్యూ టెక్నాలజీని వాడటం ప్రారంభించారు.
ఏఐ నూతన కాన్సెప్ట్ కాకున్నా చాట్జీపీటీకి విశేష ఆదరణ లభించిన అనంతరం న్యూ టెక్నాలజీ పట్ల టెకీలతో పాటు కంపెనీల్లోనూ ఆసక్తి అధికమైంది. లేటెస్ట్గా టెక్ మహీంద్ర ఏఐపై తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా న్యూ టెక్నాలజీపై ఉద్యోగులు పట్టు సాధించేందుకు చొరవ చూపింది.
తమ కంపెనీ అమెరికా వంటి మార్కెట్లలో బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్ రంగాల్లో దృష్టి సారించిందని, ఉద్యోగులను భవిష్యత్ టెక్నాలజీలపై పట్టు సాధించేలా వారిపై పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించిందని టెక్ మహీంద్ర మార్కెటింగ్ హెడ్, గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్ష్వేంద్ర సోయిన్ తెలిపారు. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో తాము దాదాపు 8000 మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ, ఇతర ఏఐ ప్లాట్ఫాంలపై శిక్షణ ఇచ్చామని చెప్పారు.
Read More :
Ambareesh Murty | పెప్పర్ ఫ్రై సీఈవో అంబరీష్ మూర్తి మృతి