ముంబై, ఏప్రిల్ 27: టెక్ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,179.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,637.9 కోట్ల లాభంతో పోలిస్తే 27 శాతం తగ్గినట్లు పేర్కొంది. 2021-22లో రూ.12,436.10 కోట్లుగా ఉన్న ఆదాయం గతేడాది చివరి త్రైమాసికంలో రూ.14,023.7 కోట్లకు ఎగబాకింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5,137.6 కోట్ల నికర లాభాన్ని గడించింది.