TCS Q1 Results | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఐదు శాతం వృద్ధి నమోదు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభం రూ.9,478 కోట్ల నికర లాభం గడించింది. గతేడాది రూ.9,008 కోట్ల నికర లాభంతో సరిపెట్టుకున్నది. కన్సాలిటెడ్ రెవెన్యూ 16.2 శాతం పెరిగి రూ.52,758 కోట్లకు చేరుకున్నది. గతేడాది ఇది రూ.45,411 కోట్లని బీఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది. జూన్ త్రైమాసికంలో ఈబీఐటీ మార్జిన్ 23.1 శాతంగా ప్రకటించింది. కానీ మార్చి నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంలో 25 శాతం, గతేడాది తొలి త్రైమాసికంలో 25.5 శాతం ఈబీఐటీ మార్జిన్లు సాధించింది టీసీఎస్. వాటాదారులకు ఒక్కో షేర్పై రూ. డివిడెండ్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే టీసీఎస్ రెవెన్యూ గ్రోత్ 3.6 నుంచి నాలుగు శాతం ఉండొచ్చునని విశ్లేషకులు అంచనా వేశారు. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఆదాయం 11-16 శాతం మధ్య ఉండొచ్చునని అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో టీసీఎస్ రూ.50,591 కోట్ల మేరకు కన్సాలిడేటెడ్ రెవెన్యూ పొందింది.
వేతనాల పెంపు, ప్రయాణ ఖర్చుల పెరుగుదల తదితర కారణాలతో ఈబీఐటీ మార్జిన్లు తగ్గుతాయని భావించారు. గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 1.2 శాతం తగ్గ వచ్చునని అభిప్రాయ పడ్డారు.