TCS | ముంబై, ఏప్రిల్ 12: దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.12,434 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.11,392 కోట్లతో పోలిస్తే ఇది 9.1 శాతం అధికం. మార్జిన్లు అధికమవడం, దేశీయ వ్యాపారం మరింత బలోపేతం కావడం వల్లనే లాభాల్లో వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 3.5 శాతం పెరిగి రూ.61,237 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
మార్జిన్లు అధికమవడం, భారీ స్థాయిలో ఆర్డర్లు రావడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ కస్టమర్లతో అనుసంధానం కలిగివుండటం వల్ల ఇది సాధ్యమైంది. బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.15 వేల కోట్ల విలువైన ఆర్డర్ రావడంతో దేశీయ వ్యాపారంలో 38 శాతం వృద్ధి నమోదైంది. ఇది మొత్తం వృద్ధిలో 5 శాతం నుంచి 6.7 శాతానికి చేరుకున్నది.
– కే కృతివాసన్, టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎండీ