Tata Tech | ఇన్వెస్టర్ల అనూహ్య స్పందనతో టాటా టెక్నాలజీస్ ఐపీఓ రికార్డు నెలకొల్పింది. గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో టాటా టెక్నాలజీస్ షేర్లు లిస్టయ్యాయి. అంతా ఊహించినట్లే బంపర్ లిస్టింగ్తో స్టాక్ మార్కెట్లలో ట్రేడయ్యాయి. టాటా టెక్ ఐపీఓ ఇష్యూ ధరతో పోలిస్తే 140 శాతం లాభంతో సంస్థ స్టాక్ ట్రేడింగ్ ప్రారంభమైంది.
టాటా టెక్నాలజీస్ ఇష్యూ ధర రూ.500. గురువారం బీఎస్ఈలో సంస్థ షేర్ రూ.1200 వద్ద లిస్టింగ్ అయింది. అంటే ఒక్క షేర్ మీద లిస్టింగ్ లోనే రూ.700 లాభం గడించింది. దీని ప్రకారం ఐపీవోలో షేర్లు పొందిన వారు ఒక్కో యూనిట్ (30 స్టాక్స్) మీద రూ.15,000 ఇన్వెస్ట్ చేశారు. లిస్టింగ్ ధరతో పోలిస్తే ఒక్కో యూనిట్ మీద పెట్టుబడిదారుడు రూ.21 వేల లాభం పొందాడు. ఇంట్రాడే ట్రేడింగ్లో బీఎస్ఈలో రూ.1400 గరిష్ట స్థాయిలో తచ్చాడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.1,327 వద్ద ముగిసింది.
టాటా సన్స్ గ్రూపు నుంచి 20 ఏండ్ల తర్వాత వచ్చిన టాటా టెక్నాలజీస్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రూ.3,042 కోట్ల పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా 4.5 కోట్ల షేర్లను సబ్స్క్రిప్షన్ కోసం తెచ్చింది. ఐపీవో గడువు ముగిసే నాటికి టాటా టెక్ సబ్ స్క్రిప్షన్లకు 69.4 రెట్లు మద్దతు లభించింది. అంటే 312.42 కోట్ల షేర్లకు ఇన్వెస్టర్లు బిడ్లు దాఖలు చేశారు. టాటా టెక్ ఐపీవో ఇష్యూ ధర రూ.500 ప్రకారం మొత్తం బిడ్ల విలువ రూ.1.56 లక్షలతో సమానం.