న్యూఢిల్లీ, నవంబర్ 25: ఐపీవోను విజయవంతంగా పూర్తిచేసుకున్న టాటా టెక్నాలజీస్ షేరుకు రూ.500 ఆఫర్ ధరను నిర్ణయించారు. రూ.475-500 ప్రైస్బ్యాండ్తో ఇష్యూ జారీఅయిన సంగతి తెలిసిందే.
రూ. 2 ముఖవిలువగల ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.500 ఆఫర్ ధరను ఖరారు చేసినట్టు టాటా టెక్ మాతృసంస్థ టాటా మోటార్స్ శనివారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. రూ.3,042 కోట్ల టాటా టెక్నాలజీస్ ఆఫర్ 69.43 రెట్లు ఓవర్సబ్స్క్రయిబ్ అయ్యింది.