TATA Group | ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదే సమయంలో జీతంలో కోతలు సైతం విధిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా దేశంలోనే ప్రతిష్టాత్మక కంపెనీగా వెలుగొంతున్న టాటా గ్రూప్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ల వేతనాలను 16 నుంచి 62శాతం వరకు పెంచింది. టాటా గ్రూప్ కంపెనీలైన ఇండియన్ హోటల్స్, టాటా పవర్, ట్రెంట్, టాటా కన్స్యూమర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ల వేతనాలు భారీగా 16 నుంచి 62శాతం వరకు పెరిగినట్లు ఓ నివేదిక తెలిపింది. టాటా గ్రూప్ 10 వర్టికల్స్లో దాదాపు 30 కంపెనీలను నిర్వహిస్తోంది. నివేదిక ప్రకారం.. ట్రెంట్ లిమిటెడ్ సీఈవో పీ వెంకటేశాలు వేతనం ఈ ఏడాది రూ.5.12కోట్లు కోట్లు చెల్లించింది. ఇది గత సంవత్సరం కంటే 62శాతం ఎక్కువ. ఇండియన్ హోటల్స్ కౌంటర్ పునీత్ చత్వాల్కు వార్షిక వేతనం రూ.18.23 కోట్లు.
జీవితంలో 37శాతం పెరుగుదల నమోదైంది. టాటా కన్స్యూమర్ సీఈవో సునీల్ డిసౌజా వేతనం రూ.9.5 కోట్లు కాగా.. 24శాతం పెరిగింది. వోల్టాస్ సీఈవో ప్రదీప్ బక్షికి వేతనం రూ.3.8కోట్లు చెల్లించారు. ఇక టాటా కెమికల్స్ సీఈవో ఆర్ ముకుందన్, టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హాల వేతనాలు 16శాతం పెరిగాయి. ఈ ఏడాది ఇద్దరికి రూ.8 కోట్లు, రూ.9కోట్ల చొప్పున చెల్లించారు. నివేదిక ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మాజీ సీఈవో రాజేశ్ గోపీనాథన్ రూ.29.1కోట్లు కంపెనీ చెల్లించింది. ఇదిలా ఉండగా.. టాటాగ్రూప్ను 1868లో జెమ్షెడ్జీ టాటా స్థాపించారు. ముంబయి నగరంలో టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు. కంపెనీ ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో విస్తరించి ఉంది. 2021-2022 సంవత్సరంలో టాటా గ్రూప్ కంపెనీల సమిష్టి ఆదాయం 128 బిలియన్లు డాలర్లు. టాటా గ్రూపులో 30 కంపెనీలు ఉండగా.. దాదాపు 9,35,000 మంది కార్మికులు పని చేస్తున్నారు.