న్యూఢిల్లీ, జూలై 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,300. 65 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది టాటా మోటర్స్. బ్రిటన్కు చెందిన జేఎల్ఆర్, కమర్షియల్ వాహన విభాగం రాణించడం వల్లనే మళ్లీ లాభాల్లోకి రాగలిగామని తెలిపింది. క్రితం ఏడాది సంస్థ రూ.4,950. 97 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.71,227. 76 కోట్ల నుంచి రూ.1,01,528.49 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు రూ.77,783.69 కోట్ల నుంచి రూ.98,266.93 కోట్లకు చేరుకున్నాయి.