Cars Rates | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన కార్ల ధరలు పెంచనున్నది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ కార్ల ధరలు పెరుగుతాయని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొంది. ఎంత మొత్తం పెంచుతామన్నది నిర్ణయం తీసుకోలేదని, త్వరలో పూర్తి వివరాలు చెబుతాం అని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి తెలిపారు. హ్యాచ్ బ్యాక్ టియాగో నుంచి ప్రీమియం ఎస్యూవీ సఫారీ వరకూ రూ.5.6 లక్షల నుంచి రూ.25.94 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి.
ఆడి ఇండియా తమ కార్ల అన్నింటిపై రెండు శాతం ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి కూడా జనవరి నుంచి కార్ల ధరలు పెరుగుతాయని పేర్కొన్నా.. ఎంత శాతం అన్నది వెల్లడించలేదు. మహీంద్రా అండ్ మహీంద్రా, మెర్సిడెజ్ బెంజ్ సైతం 2024 జనవరి ఒకటో తేదీ నుంచి కార్ల ధరలు పెంచుతామని ప్రకటించాయి.