న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: వాణిజ్య వాహనాల ధరల్ని టాటా మోటర్స్ పెంచుతున్నది. అక్టోబర్ 1 నుంచి టాటా కమర్షియల్ వెహికిల్స్ రేట్లు 3 శాతం వరకు పెరగనున్నాయి.
పెరిగిన ఉత్పాదక వ్యయం, ఇతరత్రా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 1న వాణిజ్య వాహనాల ధరల్ని 5 శాతం వరకు సంస్థ పెంచిన విషయం తెలిసిందే.