న్యూఢిల్లీ, జూన్ 18: వాణిజ్య వాహనాల ధరల్ని వచ్చే నెల జూలై 1 నుంచి 2.5 శాతం వరకు పెంచబోతున్నట్టు టాటా మోటర్స్ గురువారం ప్రకటించింది. ఆయా మాడళ్లనుబట్టి రేట్లు పెరుగుతాయని స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉత్పాదక వ్యయం ప్రభావంతోనే కొనుగోలుదారులపై భారం మోపాల్సి వస్తున్నదని ఓ ప్రకటనలో టాటా మోటర్స్ తెలిపింది. కాగా, ఇప్పటికే పలు ఆటో రంగ సంస్థలు తమ వాహనాల ధరల్ని పెంచుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.