ముంబై, మార్చి 9: మహీంద్రా గ్రూపునకు చెందిన స్వరాజ్… మార్కెట్లోకి నూతన శ్రేణి ట్రాక్టర్లను విడుదల చేయబోతున్నది. చిన్న స్థాయి రైతులకు ఉపయోగకరంగా ఉండేలా ఈ ట్రాక్టర్లను తీర్చిదిద్దింది. వీటిలో భూమిని దున్నే తక్కువ హెచ్పీ, ఎక్కువ హెచ్పీ కలిగిన ట్రాక్టర్లు ఉన్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. తెలుగు రాష్ర్టాల్లో ఉనికిని మరింత విస్తరించుకునే ఉద్దేశంలో భాగంగా సంస్థ..వరి సాగు యాంత్రీకరణకు ప్రత్యేకంగా రూపొందించిన స్వరాజ్ 742 ఎక్స్టీ ట్రాక్టర్ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది.