న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో ఇప్పటి వరకు దేశీయ ఎగుమతిదారులు చెల్లించిన సుంకాలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
టారిఫ్ల కోసం చెల్లించిన సొమ్ము తిరిగి దిగుమతిదారులకు చెల్లించడం అంత సులువుకాదని తెలుస్తున్నది. దీనివల్ల ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయి. రిఫండ్ కోసం అగ్రరాజ్యం అమెరికా వద్ద ఎలాంటి ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమి లేదు. దీంతో కంపెనీలే చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.