ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలు మూటగట్టుకున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్లు నష్టాల బాటలోనే కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ కూడా 427 పాయింట్లు నష్టపోయింది. గ్లోబల్ మార్కెట్ల నెగెటివ్ ఎఫెక్ట్ దేశీయ మార్కెట్లపై కూడా పడింది. బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ ఇండెక్స్ 427 పాయింట్లు కోల్పోయి 59,037.28 పాయింట్ల వద్ద స్థిరపడింది.
అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్జేంజ్ సూచీ నిఫ్టీ సైతం 139.85 పాయింట్లు కోల్పోయి 17,617.15 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్లో బజాజ్ ఫిన్సర్వ్ అత్యధికంగా నష్టపోయింది. 5.37 శాతం నష్టాలను మూటగట్టుకుంది. టెక్ మహీంద్రా, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అదే సమయంలో హిందుస్థాన్ యూనిలీవర్స్, మారుతి, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, టీసీఎస్ సూచీలు లాభపడ్డాయి.
భారత్తోపాటు ఆసియా దేశాల్లోని హాంగ్కాంగ్, సియోల్, షాంఘై, టోక్యో స్టాక్ మార్కెట్లు కూడా ఇవాళ నష్టాలు మూటగట్టుకున్నాయి. యూరప్లో స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.92 శాతం పడిపోయి 86.68 అమెరికన్ డాలర్లకు చేరుకున్నది.