Stock Markets : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లు (Stock Market) నిండా మునుగుతున్నాయి. చమురు ధరల భయాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు దేశీయ సూచీలను కుదిపేస్తున్నాయి. ఫలితంగా ఈ వారాన్ని కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభించాయి. ఇవాళ్టి సెషన్లో సెన్సెక్స్ (Sensex) దాదాపు 1600 పాయింట్లకుపైగా పతనమవగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టపోయి 23 వేల మార్క్ను కోల్పోయింది.
ఉదయం 10.00 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1614 పాయింట్లు దిగజారి.. 72,918 వద్ద, నిఫ్టీ 514 పాయింట్ల నష్టంతో 22,600 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 1620 పాయింట్ల వరకు పతనమైంది. నిఫ్టీలో హిందాల్కో, టాటా స్టీల్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మ్యాక్స్ హెల్త్కేర్, ఓఎన్జీసీ లాభాల్లో ఉన్నాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, లోహ రంగ సూచీలు 2 శాతం మేర కుంగాయి.
మరోవైపు డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కూడా దారుణంగా పతనమవుతోంది. ఇవాళ్టి ట్రేడింగ్లో 33 పైసలు క్షీణించి 93.86 వద్ద సరికొత్త జీవనకాల కనిష్ఠాన్ని తాకింది.