ముంబై, ఆగస్టు 25: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, చమురు రంగ షేర్లలో క్రయవిక్రయాలు జరగడంతో సూచీలు పతనాన్ని మూటగట్టుకున్నాయి. పలు దేశాలు మళ్లీ వడ్డీరేట్లు పెంచనున్నండటం, అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం సూచీల పతనానికి ఆజ్యంపోశాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 65 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. నష్టాల్లో ప్రారంభమైన సూచీ చివరి వరకు ఇదే ట్రెండ్ను కొనసాగించింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి సూచీ 365.83 పాయింట్లు కోల్పోయి 64,886.51 వద్ద ముగిసింది. సెన్సెక్స్తోపాటు నిఫ్టీ కూడా పతనం చెందింది. 120.90 పాయింట్లు తగ్గి 19,265.80 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ అమ్మకాలు మదుపరుల్లో ఆందోళనను పెంచింది. భవిష్యత్తులో వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉన్నదని ప్రపంచ బ్యాంకులు సమావేశమై నిర్ణయం తీసుకోవడంతో సూచీలు నష్టాలపాలయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని రిజర్వుబ్యాంక్ స్పష్టంచేయడం కూడా ఆందోళనను పెంచేసింది.
– వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్