Stock Markets Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. కిత్రం సెషన్తో పోలిస్తే సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్నాయి. ఉదయం 72,587.30 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. ప్రారంభంలో 72,314.16 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది. ఇంట్రాడేలో 72,985.89 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది. చివరకు 104.99 పాయింట్ల లాభంతో 72,748.42 వద్ద ముగిశాయి. నిఫ్టీ 27.80 పాయింట్లు పెరిగి.. 22,055.70 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్లో దాదాపు 1,953 షేర్లు పురోగమించగా.. 1,827 షేర్లు పతనమయ్యాయి. మరో 110 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో టాటా స్టీల్, ఎం అండ్ ఎం, జెఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, యూపీఎల్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, టైటాన్ కంపెనీ నష్టాల్లో ముగిశాయి. సెక్టార్లలో క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్, ఆటో, రియల్టీ, మెటల్, మీడియా 0.5 నుంచి 3 శాతం పెరిగాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ 0.5 నుంచి 1.5 శాతం క్షీణించాయి. బీ
ఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి.