ముంబై, నవంబర్ 7: స్టాక్ మార్కె ట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. వరుసగా మూడు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల్లోకి జారుకునేటట్టుచేశాయి. అలాగే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం సూచీలకు రుచించలేదు. ఒక దశలో 320 పాయింట్లు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 16.29 పాయింట్లు కోల్పో 64,942. 40 వద్ద ముగియగా, నిఫ్టీ 5 పాయిం ట్లు కోల్పోయి 19,406.70 వద్ద ముగిశాయి. మార్కెట్లో బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, మహీం ద్రా, ఐటీసీ, టీసీఎస్, షేర్లు నష్టపోయాయి. కానీ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సి స్ బ్యాంక్ల షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే రియల్టీ 1.21 శాతం, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్, మెటల్, టెక్నాలజీ రంగ షేర్లు నష్టపోగా..ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్కేర్, బ్యాంకింగ్, ఎనర్జీ, సేవల రంగ సూచీలు లాభాల్లో ముగిశాయి.